నేడు మహావీర్ జయంతి. జైన మతానికి చెందిన ఇరవై నాలుగవ తీర్థంకరుడు మహావీరుడు. ఆయన చిన్న వయసులోనే సన్యాసం తీసుకున్నారు. కరుణ అనే కొత్త మతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా మహావీరుడు పేరుగాంచారు. ఆయన పుట్టిన రోజైన మహావీర్ జయంతిని జైనులు పండుగగా నిర్వహించుకుంటారు. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ గురువారం చైత్ర శుద్ధ చతుర్దశి రోజు మహావీర్ జయంతి వచ్చింది. మహావీరుడు అహింసను ప్రోత్సహించి ప్రచారం చేసిన మహనీయులు.మహావీర్ జయంతి రోజున జైన ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో నిండిపోతాయి. రంగురంగుల తోరణాలు, పూలమాలలతో అలంకరించబడిన ఆలయాలు భక్తులను ఆహ్వానిస్తాయి. ఉదయం నుంచే భక్తులు బారులు తీరి మహావీరుని దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రత్యేక ప్రార్థనలు, భజనలు ఇంకా మతపరమైన ప్రవచనాలతో ఆలయాలు మార్మోగుతాయి. మహావీరుని విగ్రహానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీటితో కూడిన పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేకం పవిత్రతను శుద్ధిని సూచిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa