ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెన్నా సిమెంట్స్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి ఒంటిమిట్ట రామాలయానికి విలువైన కానుకలు సమర్పించారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 11, 2025, 03:19 PM

పెన్నా సిమెంట్స్ అధినేత పెన్నా ప్రతాపరెడ్డి ఒంటిమిట్ట రామాలయానికి విలువైన కానుకలు సమర్పించారు. ఒంటిమిట్ట సీతారామలక్ష్మణులకు మూడు బంగారు కిరీటాలు బహూకరించారు. వజ్రాలు పొదిగిన ఆ స్వర్ణ కిరీటాల విలువ రూ.6.60 కోట్లు. ఇవాళ కుటుంబ సభ్యులతో కలిసి ఒంటిమిట్ట రామాలయానికి విచ్చేసిన పెన్నా ప్రతాపరెడ్డి ఆ స్వర్ణ కిరీటాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, తిరుమల ఆలయ ఈవో జె.శ్యామలరావులకు అందజేశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ పసిడి కిరీటాలను సీతారామలక్ష్మణులకు అలంకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa