వేసవి సెలవుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి నుంచి మచిలీపట్నం మధ్య దక్షిణ మధ్య రైల్వే 14 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 13 నుంచి మే 25 వరకు ప్రతి ఆదివారం తిరుపతి నుంచి రైలు బయలుదేరుతుంది. అలాగే మచిలీపట్నం నుంచి ఏప్రిల్ 14 నుంచి మే 26 వరకు ప్రతి సోమవారం రైలు తిరుపతికి బయలుదేరుతుంది. ఈ రైళ్లు పలు స్టేషన్లలో ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఏప్రిల్ 13 నుంచి తిరుపతి మచిలీపట్నం ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. మే 25 వరకు ప్రతి ఆదివారం ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. 07121 నంబర్తో తిరుపతి - మచిలీపట్నం రైలు ప్రతి ఆదివారం రాత్రి 10 గంటల 20 నిమిషాలకు తిరుపతి రైల్వేస్టేషన్లో బయల్దేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మచిలీపట్నం చేరుకుంటుంది.
అలాగే 07122 నంబర్తో మచిలీపట్నం తిరుపతి ప్రత్యేక రైలు నడవనుంది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 26 వరకు ప్రతి సోమవారం ఇది అందుబాటులో ఉంటుంది. ప్రతి సోమవారం సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు మచిలీపట్నంలో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజామున 3 గంటల 20 నిమిషాలకు తిరుపతి చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేణిగుంట, గూడూరు, నెల్లూరు రైల్వేస్టేషన్, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, గుడివాడ, పెడన రైల్వేస్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగనున్నాయి. ఇందులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని చర్లపల్లి, శ్రీకాకుళం రోడ్ స్టేషన్ల మధ్య కూడా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa