ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి మేన కోడలు షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా భర్త, అత్తింటి వారు పైళ్లైనప్పటి నుంచి తనను వరకట్నం కోసం వేధిస్తున్నారని ఆరోపించారు. అలాగే భర్త బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నాడని.. ప్రస్తుతం ఆయన కాపురానికి కూడా పనికిరారని చెప్పారు. అందుకే మరిదితో పిల్లల్ని కనాలని.. భర్త, అత్త, మామలు బలవంత పెడుతున్నారని ఫిర్యాదులో వెల్లడించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
యూపీ మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతి మేనకోడలికి... 2023 నంవబర్ 9వ తేదీన వివాహం జరిగింది. హావూర్ మున్సిపల్ కౌన్సిల్ ఛైర్ పర్సన్ పుష్పాదేవి కుమారుడు విశాల్ సింగ్తో ఆమెకు పెళ్లి జరిపించారు పెద్దలు. ఇన్ని రోజులు వీరిద్దరూ బాగానే ఉన్నారు. అయితే ఎవరూ ఊహించని విధంగా మాయావతి మేనకోడలు ఏప్రిల్ 10వ తేదీ గురువారం రోజు పోలీసులను ఆశ్రయించారు. పెళ్లి జరిగిన తర్వాత నుంచి తన భర్త విశాల్, అత్తమామలు, ఇతర కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. వరకట్నం తేవాలని తరచుగా తిడుతున్నారని అందులో పేర్కొన్నారు.
అలాగే తాను ఇంట్లో వాళ్లతో లైంగిక వేధింపులకు కూడా గురైనట్లు వెల్లడించారు. ముఖ్యంగా తన భర్త విశాల్ బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నాడని చెప్పారు. దాని వల్ల అతను వైవాహిక జీవితానికి పనికి రాడని.. ఆ విషయం తన అత్తింటి వారందరికీ తెలుసని వెల్లడించారు. అయితే భర్త కాపురానికి పనికి రాకపోవడంతో.. తన మరిదితో పిల్లల్ని కనాలని తనను వేధిస్తున్నారని వాపోయారు. ఇదే విషయమై 2025 ఫిబ్రవరి 17వ తేదీన తన మామ, మరిది తనను తీవ్రంగా కొట్టారని.. అత్యాచారయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. వారి వేధింపులు భరించలేకే తాను పుట్టింటికి వెళ్లిపోయినట్లు చెప్పారు.
ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. అందుకే మార్చి 24వ తేదీన కోర్టును ఆశ్రయించినట్లు బాధితురాలు వెల్లడించారు. ఈక్రమంలోనే కోర్టు స్పందించి పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో భర్త, అత్తమామలు, మరో ఐదుగురు కుటుంబ సభ్యులపై గృహహింస, వరకట్న, లైంగిక వేధింపుల అభియోగాలు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి మునీష్ ప్రతాప్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని వివరించారు. మరోవైపు పుష్పాదేవి కుటుంబ సభ్యులను బీఎస్పీ నుంచి బహిష్కరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa