ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేషనల్ హెరాల్డ్ కేసు.. ఛార్జిషీట్‌లో సోనియా, రాహుల్ పేర్లు

national |  Suryaa Desk  | Published : Tue, Apr 15, 2025, 08:54 PM

కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీకి ఈడీ షాక్ ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో సోనియా, రాహుల్ పేర్లను చేర్చింది. దీంతో ఛార్జ్‌షీట్‌పై ఈనెల 25న రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ వాదనలు వినిపించనుంది. కాగా ఇప్పటికే నేషనల్ హెరాల్డ్‌ ఆస్తుల జప్తునకు ఈడీ నోటీసులు జారీ చేసింది.మరోవైపు, కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడం ఇదే తొలిసారి. హరియాణాలో జరిగిన రియల్ ఎస్టేట్ ఒప్పందంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఈడీ ప్రశ్నించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa