ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తమ్ముడు చేసిన దొంగతనం.. అక్క ఇంట్లో మూడు మరణాలు

national |  Suryaa Desk  | Published : Wed, Apr 16, 2025, 08:59 PM

పెళ్లై అత్తింట్లో ఉంటున్న ఏ అమ్మాయికి అయినా పుట్టింటి నుంచి ఎవరైనా వస్తే వచ్చే సంతోషమే వేరు. వారు వచ్చినప్పటి నుంచి వెళ్లేదాకా తెగ మురిసిపోతూ సపర్యలు చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మానాన్నలు, అక్కాచెల్లెల్లు, సోదరులు వస్తే ఇక ఆమె సంతోషానికి అవధులే లేకుండా పోతాయి. అచ్చంగా ఇలాగే ఫీలైందో అమ్మాయి. తన తమ్ముడి ఇంటికి రాగా అతడికి నచ్చినవన్నీ వండి ప్రేమగా వడ్డించింది. చాలా కాలం తర్వాత కలిశామంటూ అనేక విషయాలు గురించి మాట్లాడింది. చిన్ననాటి రోజులను గుర్తు చేసుకుంటూ తమ్ముడిపై ప్రేమను గుర్తు చేసింది. అతడు కూడా అక్క ప్రేమకు పొంగిపోయాడు.


ఇలా చూస్తుండగానే రెండు రోజులు గడిసిపోగా తిరిగి ఇంటికెళ్లిపోతానని చెప్పాడు తమ్ముడు. అక్క కూడా గుండెల నిండా ప్రేమతో మళ్లీ రమ్మని చెప్పి సాగనంపింది. కానీ ఆ తర్వాత ఆమెకు అసలు విషయం బోధ పడింది. ముఖ్యంగా తమ్ముడు వెళ్తూ వెళ్తూ తన ప్రేమను, జ్ఞాపకాలను మాత్రమే తీసుకెళ్లలేదని భర్త మొబైల్ ఫోన్ సహా నగదును ఎత్తుకెళ్లాడని గుర్తించింది. అయితే తనకంటే ముందే ఈ విషయం ఆమె భర్తకు తెలిసింది. ఫలితంగా బావ మరిదికి ఫోన్ చేసి వాదులాడాడు. అప్పటికే విపరీతమైన బాధతో కన్నీళ్లు పెట్టుకుంటున్న మహిళను సైతం తిట్టగా అవమాన భారం భరించలేక ఆత్మహత్య చేసుకుంది. తనతోపాటు తన ఇద్దరు పిల్లలను కూడా వెంట తీసుకెళ్లింది. ఈ విషాధకర ఘటన ఎక్కడ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


కర్ణాటకలోని చామరాజనగర జిల్లా హనూరు తాలుకా కాడుగోళ గ్రామానికి చెందిన మహేశ్‌కు చాలా ఏళ్ల క్రితమే వేరే గ్రామానికి చెందిన 30 ఏళ్ల సుశీలతో వివాహం జరిగింది. అయితే వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా 11 ఏళ్ల దివ్య, 8 ఏళ్ల చంద్రు పుట్టారు. అయితే హాయిగా సాగుతున్న వీరి కాపురంలోకి అనుకోకుండా ఓ విషాధం వచ్చి పడింది. ముఖ్యంగా సుషీల తమ్ముడ మాదేవ ఆదివారం రోజు వారింటికి వచ్చాడు. చాలా రోజుల తర్వాత తమ్ముడు రాగా తెగ మురిసిపోతూ సుశీల సపర్యలు చేసింది. తమ్ముడు మాదేవపై ప్రేమను కురిపిస్తూ మంచిగా చూసుకుంది. మేనమామ రావడంతో పిల్లలు కూడా తెగ సంబుర పడిపోయారు. అతడితో ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేశారు.


ఈక్రమంలోనే అక్క, పిల్లలు చూడకముందు మాదేవ ఇంట్లో నుంచి బావ ఫోన్, నగదును తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఇక వెళ్తానంటూ అక్కకు చెప్పి వెళ్లిపోయాడు. అయితే అతడు వెళ్లిన చాలా సేపటికి మహేశ్.. తన ఫోన్, నగదు లేకపోవాడన్ని గుర్తించాడు. ఇంటికి వచ్చింది మాదేవనే కాబట్టి అతడే తీసుంటాడని అనుమానం వ్యక్తం చేశాడు. వెంటనే బావమరిదికి ఫోన్ చేసి ఇంటికొచ్చి ఇలా చేయడం తప్పు, నేను చాలా కష్టపడి సంపాదించిన డబ్బు అది తిరిగిచ్చేయమంటూ గొడవ పడ్డాడు. ఆపై ఫోన్ పెట్టేసి భార్య సుశీలపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీ తమ్ముడు మనింట్లోనే ఇలా ఎలా చేయగలిగాడని ప్రశ్నించాడు.


తమ్ముడు దొంగతనం చేసిన విషయం గుర్తించి తీవ్ర మనోవేదనకు గురైన సుశీలను భర్త మాటలు మరింత బాధ పెట్టాయి. దీంతో అవమాన భారం భరించలేక అదేరోజు పిల్లల్ని తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. అయితే కోపంగా ఉంది కాబట్టి భార్య పుట్టింటికే వెళ్లుండొచ్చని భావించిన మహేష్ ఆమెతో వెళ్లలేదు. కానీ సుశీల మాత్రం పుట్టింటికి వెళ్లకుండా తమ ఇంటికి దగ్గర్లో ఉన్న ఓ బావి వద్దకు వెళ్లి పిల్లలను అందులో తోసేసింది. ఆపై ఆమె కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. అయితే మరుసటి రోజు ఉదయం స్థానికులు సుశీల బట్టలు, పిల్లల బట్టలు, తాళిబొట్టు వంటివి బావి వద్ద ఉండడాన్ని గమనించారు. ఇలా ఆమె భర్తతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు సుసీల, దివ్య, చంద్రు మృతదేహాలను బావిలోంచి వెలికి తీశారు. ఆపై పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భర్త మహేష్ ఫిర్యాదు మేరకు ఆమె సోదరుడిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa