జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్యతో కలిసి మాదిపాడు బ్రిడ్జి నిర్మాణ పనులను గురువారం పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. ఆ తర్వాత ఇంజినీరింగ్ అధికారులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణ పనులపై పలు సూచనలు చేసినట్లు ఆయన వివరించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే కృష్ణ, గుంటూరు జిల్లాలకు రవాణా సౌకర్యం సులభంగా ఉంటుందన్నారు. బ్రిడ్జి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం త్వరగా పూర్తి చేసేలా కృషి చేస్తుందన్నారు.
![]() |
![]() |