మహారాష్ట్రలోని పూణె జిల్లా పరిధిలో ఘోర ప్రమాదం జరిగింది. పూణె నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ వోల్వో బస్సు హైవేపై కాలిపోయింది. బస్సు ఖేడ్ శివపూర్ సమీపంలోకి రాగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రయాణికులు గమనించి వెంటనే కిందికి దిగేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.అయితే వేసవిలో తరచూ అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా వాహనాలు ఉన్నట్టుండి మంటల్లో కాలిపోయిన ఘటనలు ఎన్నో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనదారులు వేసవిలో కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మండు వేసవిలో మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమమని చెబుతున్నారు.
![]() |
![]() |