ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలోని ఆ రైల్వేస్టేషన్‌‌‌కు మహర్దశ.... రూపురేఖలే మారిపోతాయ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Apr 19, 2025, 08:05 PM

ఆంధ్రప్రదేశ్‌లోని ధర్మవరం రైల్వేస్టేషన్‌లోకి అడుగుపెట్టగానే ప్రయాణికులను ఆకర్షించేలా ఆధునీకరిస్తున్నారు. ఆ విధంగా ధర్మవరం రైల్వేస్టేషన్‌ ఆవరణలో రైల్వే శాఖ అభివృద్ధి పనులు చేపడుతోంది. ఏడున్నర కోట్లతో పనులు చేపట్టనుండగా.. తొలి విడత కింద రూ.3.50 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో రైలు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు. 2014లో ధర్మవరం రైల్వేస్టేషన్ భవనం నిర్మించారు. ధర్మవరం రైల్వేస్టేషన్‌‌కు ప్రయాణికుల తాకిడి ఎక్కువ. అటు బెంగళూరు వైపు వెళ్లే రైళ్లు, ఇటు తిరుపతి వైపు వెళ్లే రైళ్లు ఈ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తుంటాయి. దీంతో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ధర్మవరం రైల్వేస్టేషన్ అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.


ఆధునీకరణ పనుల్లో భాగంగా ధర్మవరం రైల్వేస్టేషన్‌ ముఖ ద్వారం ఏర్పాటు చేశారు. అలాగే కొత్తపేట కూడలి నుంచి ధర్మవరం రైల్వేస్టేషన్‌ వరకు తారు రోడ్డు వేశారు. స్టేషన్ బయట సిల్క్‌సిటీ బోర్డు ఏర్పాటు చేశారు. ధర్మవరం రైల్వేస్టేషన్ ఆవరణలో ఉద్యానవం ఏర్పాటు చేయనున్నారు. అలాగే స్టేషన్ వద్ద ఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్, జీఆర్పీ, రైల్వే ఆస్పత్రి భవనం నిర్మించనున్నారు. ధర్మవరం రైల్వేస్టేషన్‌లో ఆరు ప్లాట్‌ఫామ్‌లు ఉండగా.. ప్రయాణికుల కోసం వెయిటింగ్ హాల్ నిర్మించారు. లిఫ్టు, ఆరు ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తున్నారు. 600 మంది ప్రయాణికులు కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. త్వరలోనే ఈ పనులు పూర్తి చేయనున్నట్లు ధర్మవరం రైల్వేస్టేషన్ అధికారులు చెప్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa