ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన జనవాణి నిర్వహణలో మార్పులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 21, 2025, 11:56 AM

ఎండ తీవ్రత వల్ల జనవాణి పని వేళల్లో మార్పులు చేస్తున్నట్లు మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. ఈ కొత్త పని వేళలు సోమవారం నుంచి గురువారం వరకు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు.. తిరిగి సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల వరకు ఉంటాయని పేర్కొంది. ఈ కొత్త సమయాలు సోమవారం నుండి అమలులోకి వస్తాయని.. అందుకు అనుగుణంగా జనసేన జనవాణి సేవలు వినియోగించుకోవాల్సిందిగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం పేర్కొంది. జనసేన పార్టీ చేపట్టిన జనవాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన వచ్చింది. వేలాదిమంది ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు తరలివస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa