అమరావతి పునర్మాణ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రావడం శుభసూచకమని తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలువురు కేంద్ర మంత్రులతో రేపు(మంగళవారం) సమావేశం అవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుస్తారని అన్నారు. ప్రధాని మోదీ పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వ్యాఖ్యానించారు. అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి సూచిక అని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి మోదీ సహాయ సహకారాలతో ఈసారి అమరావతి రాజధాని నిర్మాణాన్ని నిర్ణయిత సమయంలోనే పూర్తి చేస్తామని అన్నారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వంలో ఏపీకి తీరని నష్టం జరిగిందని విమర్శించారు. ఏపీకి ప్రధాని సహాయ సహకారాలు చాలా అవసరమని చెప్పారు. ప్రధాని అమరావతికి రావడం ద్వారా పెట్టుబడిదారుల్లో, ప్రజల్లో కొత్త శక్తి, ఉత్సాహం వస్తాయని.. తద్వారా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అనేకమంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తారని ఎంపీ అప్పలనాయుడు పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa