ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మే 2న జరిగే ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటన సందర్భంగా, అమరావతి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు దంపతులు మోదీని అధికారికంగా ఆహ్వానించనున్నారు. మోదీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏపీ ప్రభుత్వం, అమరావతిలో ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.5 ఏళ్ల పాటు పనులు నిలిచి పోవడం, నిర్మాణ సామాగ్రి అయిన స్టీల్, ఇతర వస్తువుల ధరలు పెరగడం వలనే నిర్మాణ వ్యయం పెరిగిందని అన్నారు. వైఎస్సార్సీపీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ కూడా కాదని అన్నారు. అమరావతికి గతంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారన్నారు. మళ్లీ ప్రధాని చేతుల మీదుగానే అమరావతి పనులు పునఃప్రారంభం అవుతాయన్నారు.ప్రధాని చేతుల మీదగా లక్ష కోట్ల పనులకు శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. 5 లక్షల మంది ప్రజలు ప్రధాని సభకు హాజరవుతారన్నారు. నేషనల్ హైవేకు కనెక్ట్ చేసే రోడ్లు గుర్తింపు, 11 పార్కింగ్ ప్లేస్లు గుర్తించామన్నారు. 8 రోడ్లు ద్వారా బహిరంగ సభ వేదికకు చేరుకోవచ్చని తెలిపారు. భద్రతాపరంగానూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ప్రధాని అమరావతికి చేరుకోగానే రోడ్ షో నిర్వహిస్తారని మంత్రి నారాయణ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa