ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పహల్గాం దాడిపై తొలిసారి నోరు విప్పిన పాక్ ప్రధాని.. దేనికైనా సిద్దమేనంటూ ప్రకటన

international |  Suryaa Desk  | Published : Sat, Apr 26, 2025, 10:27 PM

జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో ఏప్రిల్ 22వ తేదీన ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో 26 మందిని ముష్కరులు చంపేయగా.. మరెంతో మందిని తీవ్రంగా గాయపరిచారు. అయితే ఇదంతా చేసింది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులేనని తేల్చిన భారత్.. ఈ దేశంపై పలు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. ముఖ్యంగా సింధు నదీ జలాల ఒప్పందం రద్దు, దేశం నుంచి పాక్ పౌరుల తరలింపు వంటి చర్యలు చేపడుతోంది. ఈక్రమంలోనే పాక్ కూడా అనేక చర్యలతో భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. అయితే ఇన్నాళ్లూ ఈ ఘటనపై నోరు విప్పకుండానే అనేక చర్యలు తీసుకుంటున్న పాకిస్థాన్ ప్రధాని షెబబాద్ షరీఫ్ తొలిసారి నోరు విప్పారు. ఈ అంశంపై ఆసక్తికర కామెంట్లు చేశారు. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులేనని భారత భద్రతా బలగాలు గుర్తించాయి. కానీ పాక్ మాత్రం తమకు ఏ సంబంధం లేదని, కావాలనే భారత్ తమపై ఆరోపణలు చేస్తుందని వివరించింది. కానీ ఆదేశ ఉప ప్రధాని, రక్షణ మంత్రి మాట్లాడిన మాటలు చూస్తుంటే మాత్రం వాళ్లే ఈ దాడి వెనుక ఉన్నట్లు తెలుస్తుండగా.. భారత్ ప్రతీకార చర్యలకు సిద్ధం అయింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు పాక్ పౌరులను వారి దేశాలకు తిరిగి పంపిస్తోంది. దీంతో ఈ దేశం కూడా భారత విమానాలకు గగనతాలన్ని మూసివేసింది.


ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ తొలిసారి నోరు విప్పారు. ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పాకిస్థాన్ మిలిటరీ అకాడమీ గ్రాడ్యుయేషన్ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. ఉద్రిక్తతల గురించి వ్యాఖ్యానించారు. పహల్గాంలో ఇటీవల జరిగిన విషాదకర ఘటనతో మరోసారి తమ దేశం నిందలు ఎదుర్కుంటుందని వెల్లడించారు. ఈ ఘటనపై తటస్థ, పారదర్శక, విశ్వసనీయ దర్యాప్తులో పాల్గొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే శాంతి మార్గంలో నడిచేందుకు తాము తొలి ప్రాధాన్యం ఇస్తామంటూ వివరించారు. అంతేకాకుండా ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తామంటూ షెహబాజ్ షరీఫ్ చెప్పుకొచ్చారు.


భారత ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేస్తామంటూ చేసిన కామెంట్లపై పరోక్షంగా స్పందిస్తూ.. షాకింగ్ కామెంట్లు చేశారు. తమ దేశ భద్రత, సార్వభౌమత్వంపై ఎప్పటికీ రాజీ పడబోమన్నారు. ఎలాంటి ముప్పును అయినా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే సింధు జలాల ఒప్పందం నిలిపివేత అంశాన్ని ప్రస్తావిస్తూ.. భారత్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. తమపై పగ తీర్చుకునేందుకు తీసుకుంటున్న చర్యలు అన్ని యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయన్నారు. చర్చల ద్వారా మాత్రమే తాము సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa