జనసేన నుంచి వైసీపీలోకి చేరికలు మొదలయ్యాయి. జనసేన విశాఖ లోక్సభ అభ్యర్థి గేదెల శ్రీనివాస్ (శ్రీనుబాబు) పార్టీకి గుడ్ బై చెప్పారు. శనివారం సాయంత్రం వైసీపీ అధినేత జగన్ను హైదరాబాద్ లోటస్ పాండ్లో కలిసి పార్టీలో చేరారు. శ్రీనివాస్కు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర వైసీపీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. మరోవైపు శ్రీనివాస్ శ్రీకాకుళం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీచేయాలని భావించారట. కాని విశాఖ సీటు కేటాయించ డంపై అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే జనసేనను వీడి వైసీపీలో చేరినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ ఈ నెల 14న రాజమండ్రిలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఆ జాబితాలో శ్రీనివాస్ను విశాఖ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో.. శ్రీనివాస్ జనసేనకు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. జనసేనలో కీలక నేతగా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఉన్నట్టుండి పార్టీ మారడం ఆసక్తికరంగా మారింది. జనసేన ఉత్తరాంధ్ర కన్వీనర్ గా శ్రీనుబాబు కొనసాగారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa