బిహార్కు చెందిన ఓ మహిళకు ఇప్పటికే పెళ్లి అయి ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. ఇన్నాళ్లూ భర్త, పిల్లలతో హాయిగా ఉన్న ఆమెకు.. తన అన్న భార్య చెల్లెలితో స్నేహం ఏర్పడింది. మరదలు చాలా చిన్నది కాగా.. ఎప్పుడూ వదినతోనే ఉండేది. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆడవాళ్లే అయినప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ బాలిక కోసం మహిళ భర్త, ముగ్గురు పిల్లలను కూడా వదిలేసి పారిపోయింది. రహస్యంగా వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అంతా షాక్ అయ్యారు. ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించారు. మరి వారేం చేశారో మనం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బిహార్లోని దర్బంగా జిల్లా కుషెష్వర్స్థాన్కు చెందిన క్రితికి 11 ఏళ్ల క్రితమే కృష్ణ మాంఝీతో వివాహం జరిగింది. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ముగ్గురు పిల్లలు కూడా పుట్టారు. అయితే చాలా కాలం వీరంతా హాయిగానే ఉండగానే.. ఇటీవలే క్రితికి.. తన అన్న భార్య చిన్న చెల్లెలితో స్నేహం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. అయితే ఈ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. గత రండేళ్లుగా ఆ మైనర్ బాలిక, క్రితిలు చాటుమాటుగా ప్రేమాయణం సాగిస్తున్నారు. ప్రతిరోజూ గంటల తరబడి ఫోన్లు మాట్లాడేవారు. అయితే ఇద్దరూ ఆడవాళ్లే కావడంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు. కానీ క్రిత భర్త కృష్ణకు మాత్రం ఆమె తరచుగా ఫోన్ మాట్లాడడం నచ్చక చాలా సార్లు గట్టిగా నిలదీశాడు.
దీంతో క్రితి మైనర్ మరదలితో.. తనకున్న సంబంధం గురించి చెప్పేసింది. తామిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నట్లు వివరించింది. దీంతో భర్త షాకయ్యాడు. మనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు, నువ్విప్పుడు ఇలా చేయడం సరికాదని తెలిపాడు. మరదలి వయసు తమ కుమార్తెల వయసుకు చాలా దగ్గరగా ఉంటుందని.. ఇదంతా తప్పని వివరించాడు. కానీ క్రితి మాత్రం భర్త మాటలను కొట్టి పారేసింది. వద్దని చెప్తే.. మిమ్మల్ని వదలేసి వెళ్లిపోతానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీంతో భర్త కూడా ఆమె తరచుగా ఫోన్లు మాట్లాడినా ఏమీ చేయలేకపోయాడు.
ఇదిలా ఉండగా.. ఏప్రిల్ 6వ తేదీన క్రిత తన మైనర్ మరదలిని తీసుకుని రాజస్థాన్కు పారిపోయింది. అక్కడే వీరిద్దరూ రహస్యంగా వివాహం చేసుకున్నారు. 20 రోజుల పాటు వారిద్దరూ అక్కడే హాయిగా గడిపారు. కానీ ఎక్కువ కాలం అక్కడే ఉండలేమని అర్థం చేసుకుని ఈనెల 26వ తేదీన ఇంటికి తిరిగి వచ్చారు. మరోవైపు మైనర్ బాలిక కనిపించకుండా పోయిన వెంటనే ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి పోలీసులు సైతం వీరిని వెతుకుండగా.. 26వ తేదీన గ్రామంలోకి వచ్చి వెంటనే మహిళ సహా ఆమె భర్త, మరదలిని అదుపులోకి తీసుకున్నారు. అయితే కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు మైనర్ బాలికను వారికి అప్పగించి క్రితి, ఆమె భర్త కృష్ణను జైల్లోనే పెట్టారు.
తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, వద్దని ఎంత చెబుతున్నా వినకుండా భార్యే ఈ దారుణానికి ఒడిగట్టిందని కృష్ణ పోలీసులకు వివరిస్తున్నారు. మరోవైపు మైనర్ బాలిక తల్లిదండ్రులు.. వరుసకి వదినా మరదళ్లు అవుతారు కాబట్టి స్నేహంగా ఉన్నారనుకున్నామని.. ఇలాంటి బంధం ఉందని తెలిస్తే ఇంట్లోకి కూడా రానిచ్చే వాళ్లం కాదని వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa