పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)ను స్వాధీనం చేసుకోవడమే కశ్మీర్ వివాదానికి శాశ్వత పరిష్కారమని భారత సంతతికి చెందిన బ్రిటిష్ పార్లమెంటు సభ్యుడు లార్డ్ మేఘనాథ్ దేశాయ్ అభిప్రాయపడ్డారు. పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమస్యకు పీఓకేను స్వాధీనం చేసుకోవడమే ఏకైక పరిష్కారమని ఆయన భారత ప్రభుత్వానికి సూచించారు.పహల్గామ్లో అమాయక పర్యాటకులపై జరిగిన దాడి అత్యంత క్రూరమైన చర్య అని లార్డ్ దేశాయ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కశ్మీర్ వివాద చరిత్రలో ఇదే చివరి హింసాత్మక ఘటన కావాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని, భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా నిరోధించడానికి భారత్ గట్టిగా స్పందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.పీఓకే ఎప్పటికీ భారతదేశ అంతర్భాగమేనని దేశాయ్ స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa