ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శాంతమ్మది హత్యే నిర్ధారించిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 30, 2025, 04:53 PM

తిరుపతి జిల్లాలోని జీవకోనలో జరిగిన వృద్ధురాలి మృతిపై పోలీసులు పురోగతి సాధించారు. ఈనెల 11న జీవకోన, రాఘవేంద్ర నగర్‌లో సిరివెళ్ల శాంతమ్మ (64) అనే వృద్ధురాలి మృతి తీవ్ర కలకలం రేపింది. అయితే అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కాగా.. పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటపడ్డాయి. సిరివెళ్ల శాంతమ్మది హత్యే అని పోలీసులు తేల్చేశారు. డబ్బును కాజేసేందుకు వృద్ధురాలిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ హత్యలో ఐదుగురిని నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.నిందితుల నుంచి రూ.13 లక్షల విలువగల 129 గ్రాముల బంగారం, వెండి నగలు, రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఈరోజు (బుధవారం) మీడియా సమావేశం నిర్వహించి.. శాంతమ్మ హత్యకు సంబంధించిన వివరాలు తెలియజేశారు. నిందితుల్లో ఏ1, ఏ2లు వృద్ధురాలు ఉండే భవనంలో రెండవ అంతస్థులో అద్దెకు ఉన్నారు. ఈ క్రమంలో నాలుగవ అంతస్థులో నివాసముంటున్న యజమాని శాంతమ్మతో చనువుగా ఉన్నారు. ఆమె వద్ద భారీగా బంగారం, నగదును గుర్తించిన నిందితులు శాంతమ్మను హత్య చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో పథకం ప్రకారమే హత్య చేసి ఆపై దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించారు. హత్య అనంతరం ఇంటిలో ఉన్న బంగారు నగలు, డబ్బు తీసుకుని నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. చివరకు శాంతమ్మను డబ్బుకోసం దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa