ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ట్రంప్‌ 2.0 పాలనపై తొలిసారి కమలా సెటైర్లు

international |  Suryaa Desk  | Published : Fri, May 02, 2025, 11:11 PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడి పరిస్థితులు ఎలా మారాయో అందరికీ తెలిసిందే. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపారు. కొంతమంది అక్రమ వలసదారులను గుర్తించి దేశం నుంచి తరిమేశారు. ఇంకా చాలా మందిని దేశం నుంచి పంపేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు వీసా పాలసీల్లో మార్పులు తీసుకొచ్చి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌ని కూడా దేశం నుంచి పంపిస్తున్నారు. అయితే, ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల అమెరికన్ల నుంచి కూడా కొంత వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ విమర్శలు గుప్పించారు. ‘ఈ దేశం ఎప్పటికీ మనదేనని గుర్తుంచుకోండి. ఇది మన ప్రజలకు చెందుతుంది. వైట్ హౌస్‌లో ఉన్నవారికి కాదు’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ వంద రోజుల పాలనపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa