ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 03, 2025, 12:39 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ మాజీ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి.. శ్రీవారిని దర్శించుకున్నారు. సతీ సమేతంగా ఈ తెల్లవారు జామున శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తొలుత స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. తన మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం శ్రీవారి సేవలో పాల్గొన్నారు.దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో విజయసాయిరెడ్డికి వేదాశీర్వచనాలు పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శేషవస్త్రాన్ని బహూకరించారు. ఆలయం వెలుపల సాయిరెడ్డితో మాట్లాడటానికి విలేకరులు ప్రయత్నించగా.. ఆయన పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు.ఆవిర్భావం నుంచీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన సాయిరెడ్డి ఇప్పుడు రాజకీయాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం ఆయన మద్యం కుంభకోణంలో విచారణను ఎదుర్కొంటోన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అయిదు కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 20 నుంచి 22 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa