జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 26 మంది అమాయక పర్యటకుల ప్రాణాలు తీయడాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోతుంది. ముఖ్యంగా ఈ దాడికి కారణం పాకిస్థాన్ ఉగ్రవాదులేనని గుర్తించిన సర్కారు.. ఆ దేశంపై అనేక రకాలుగా ఒత్తిడి తీసుకు వస్తోంది. ఇప్పటికే సింధూ నదీ జలాల ఒప్పందం రద్దు చేయడంతో పాటు ఆ దేశ పౌరులను తిరిగి పంపించింది. అలాగే ఆ దేశ విమానాలను మన గగనతలలంలోకి రాకుండా చర్యలు చేపట్టింది.
ఇవి మాత్రమే కాకుండా ఆ దేశానికి వెళ్లే ఇతర వనరులు, అవకాశాలను కూడా కట్ చేస్తూ.. దాయాది దేశానికి చుక్కలు చూపిస్తోంది. ఈక్రమంలోనే మరో షాకింగ్ నిర్ణయం తీసుకుని పాకిస్థాన్పై పగ తీర్చుకుంటుంది. ముఖ్యంగా ఈ దేశం నుంచి మన దేశానికి వచ్చే అన్ని రకాల ఉత్పత్తులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్పై కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దౌత్యపరంగా ఇస్లామాబాద్కు అనేక రకాల ఆంక్షలు విధించిన మోదీ సర్కారు.. తాజాగా పాకిస్థాన్ నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతి అయ్యే అన్ని రకాల వస్తువులపై నిషేధం విధించింది. ఈ విషయాన్ని నేరుగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. పాకిస్థాన్ నుంచి భారత దేశానికి ప్రత్యక్ష దిగుమతులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. కొన్ని వస్తువులు పరోక్ష మార్గంలో, మూడో దేశాల ద్వారా దేశంలోకి ప్రవేశిస్తున్నాయి.
అయితే వీటన్నిటిపై భారత్ నిషేధం విధించింది. అనుమతులు ఉన్నప్పటికీ.. ఉత్పత్తులైనా, స్వేచ్ఛాయుత దిగుమతులైనా పాకిస్థాన్ నుంచి అనుమతించబోమని వివరించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. అలాగే ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే.. భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్లో వెల్లడించింది. దేశ భద్రత, ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా స్పష్టం చేసింది.
2019లో పుల్వామా దాడి తర్వాత నుంచే దాయాది దేశం నుంచి అనేక వరకు దిగుమతులు తగ్గించుకున్న భారత్.. ఆ దేశ ఉత్పత్తులపై 200 శాతం సుంకం విధించింది. ప్రస్తుతం కొన్ని రకాలా ఫార్మా ఉత్పత్తులు, పండ్లు, నూనె గింజెలు వంటి వాటిని మాత్రమే పాక్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే ఈ దిగుమతుల విలువ చాలా తక్కువ. ప్రపంచ వ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం 0.1 శాతం మాత్రమే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa