అనంతపురం, మే 4, 2025: భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగర పునర్నిర్మాణ కమిటీ ఎన్నిక కోసం ఆదివారం ఎన్జీవో కాంపౌండ్లోని పెన్షనర్ల భవన్లో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఐఎఫ్టియు నాయకులు ఎర్రి స్వామి అధ్యక్షత వహించారు.
సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ, ఐఎఫ్టియు విప్లవ కార్మిక సంఘం దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కార్మికుల పక్షాన నిలబడి పోరాడుతోందని తెలిపారు. సంఘటిత, అసంఘటిత కార్మికులను సమీకరించి, వారి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ కార్మికుల హక్కుల కోసం కృషి చేస్తోందని వారు వెల్లడించారు.
ఈ సమావేశంలో నగర కమిటీ ఎన్నికలతో పాటు కార్మిక సమస్యలపై చర్చించి, భవిష్యత్ కార్యాచరణను రూపొందించినట్లు నాయకులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa