పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పర్యటకులకు భద్రత కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీ కోర్టు కొట్టి వేసింది. అలాగే ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు సున్నితత్వాన్ని అర్థం చేసుుకోకుండా పదే పదే ఎందుకు పిటిషన్ వేస్తున్నారని మండిపడింది. కేవలం పబ్లిసిటీ కోసమే మీరిదంతా చేస్తున్నారని అర్థం అవుతుందని.. అసలు మిమ్మల్ని ఎవరు ఇంతగా ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నించింది. అంతేకాకుండా ఇకనైనా మీరు బాధ్యతగా మెలగాలని సూచించింది. ఆపూర్తి వివరాలు మీకోసం.
ఏప్రిల్ 22వ తేదీన జమ్ము కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనలో మొత్తంగా 26 మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. లాయర్ విశాల్ తివీరా ఈ ఘటనపై న్యాయ విచారణ జరపాలంటూ నాలుగు రోజుల క్రితమే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దాన్ని పరిశీలించిన న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మన బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది. ఇలా చేయడం సరికాదని, పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని చెప్పింది. దీంతో పిటిషన్ వెనక్కి తీసుకున్న ఆయన.. నాలుగు రోజులు కూడా కాకముందే మరో పిటిషన్ వేశారు.
ముఖ్యంగా పర్యటకులకు భద్రత కల్పించాలని కోరుతూ మరోసారి లాయర్ విశాల్ తివారీ.. సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇది చూసిన అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచారం కోసమే మీరు ఈ పిటిషన్ వేశారంటూ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం తప్పుపట్టింది. ముఖ్యంగా జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. మీరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించారు. దీని వెనుక మీ అసలు ఉద్దేశం ఏంటని అడిగారు. ఈ సమస్య సున్నితత్వం మీకు అర్థం కాలేదా అంటూనే.. దేశం పట్ల కొంతైనా బాధ్యతో మెలగాలని సూచించారు.
అయితే దీనిపై స్పందించిన పిటిషనర్, న్యాయవాది విశాల్ తివారీ.. పర్యటకులను లక్ష్యంగా చేసుకుని దాడి జరగడం ఇదే తొలి సారని, అందుకే పర్యటకులకు మెరుగైన భద్రత కల్పించాలనేది తమ ఉద్దేశం అని ధర్మాసనానికి తెలిపారు. కానీ సుప్రీం కోర్టు మాత్రం ఈ పిటిషన్ను విచారంచేందుకు అంగీకరించకుండా.. పిటిషనర్ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. అలాగే పదవీ విరమణ చేసిన హైకోర్టు లేదా సుప్రీం కోర్టు న్యాయవాది ఎప్పటి నుంచి ఉగ్రవాదం గురించి దర్యాప్తు చేయడానికి నిపుణులుగా మారారంటూ ప్రశ్నలు వేసింది. మేము దీన్ని ఏమాత్రం అంగీకరించం అంటూనే.. దయచేసి మీరెక్కడికైనా వెళ్లొచ్చంటూ చెప్పుకొచ్చింది.
అలాగే ప్రజా ప్రయోజనాలకు సేవ చేయాలనే ఉద్దేశం లేకుండా కేవలం పబ్లిసిటీ కోసమే వెంటనే వెంటనే.. లాయల్ విశాల్ తివారీ పిటిషన్లు దాఖలు చేస్తున్నారని పునరుద్ధాటింటింది. వీటిల్లో ప్రజల పట్ల నిజమైన ఆందోళన ఏదీ కనిపించడం లేదని, పబ్లిసిటీయే లక్ష్యంగా పిటిషన్ వేసినట్లు అర్థం అవుతుందని చెప్పుకొచ్చింది. దీనికి న్యాయపరమైన జోక్యం ఏమాత్రం అవసరం లేదని తేల్చి చెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa