రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈనెల 19న శబరిమల అయ్యప్ప ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆలయాన్ని దర్శించనున్న తొలి భారత రాష్ట్రపతిగా ఆమె చరిత్రలో నిలిచే అవకాశం ఉంది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు ఆమె పర్యటనను అధికారికంగా ధ్రువీకరించింది. ఈనెల 18న కేరళలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్న అనంతరం, 19న శబరిమల వెళ్లనున్నట్లు సమాచారం.అందరి భక్తుల్లా రాష్ట్రపతి కొండపైకి వెళ్తారా.. లేక అత్యవసర అవసరాల కోసం ఉపయోగించే రహదారి ద్వారా ఆలయానికి చేరుకుంటారా అన్నదానిపై స్పష్టత లేదు. దీనిపై స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ నిర్ణయం తీసుకుంటుందని ట్రావెన్కోర్ దేవస్వం ప్రెసిడెంట్ ప్రశాంత్ తెలిపారు. ఈ సందర్భంగా ద్రౌపదీ ముర్ము ఓ రికార్డు నెలకొల్పనున్నారు. శబరిమల ఆలయాన్ని సందర్శించిన తొలి ప్రెసిడెంట్గా ముర్ము నిలవనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa