ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మోడీ ఆపరేషన్ సింధూర విజయవంతం చెయ్యి స్వామీ..విహెచ్ పి మొక్కులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 07, 2025, 04:00 PM

పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సింధూర విజయవంతం కావాలని వెంకటేశ్వర స్వామిని కోరుకున్నట్టు  విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ అన్నారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు రాఘవులు జీ, ఆంధ్ర, తెలంగాణ క్షేత్ర కార్యదర్శి రవి కుమార్ జీ మీడియాతో మాట్లాడారు. అలోక్ కుమార్ మాట్లాడుతూ పహల్గాం ఉగ్రవాద దాడికి  ప్రతికార చర్య భారత్ చేపట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై దాడి చేయడం శుభ పరిణామం అన్నారు. ధర్మం, శాంతి కోసం భారత్ పోరాటం చేస్తోందని చెప్పారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా మెండుగా భారత్ పై ఉన్నాయని  ,దేవుడే మనకు తోడుగా ఉన్నాడని ధీమా వ్యక్తం చేసారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa