ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనుమానంతో భార్యని చంపిన భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, May 08, 2025, 02:50 PM

భార్యపై అనుమానంతో కిరాతకంగా హత్య చేసిన ఘటన టెక్కలి పరిధిలోని కోట బొమ్మాళి మెయిన్‌ రోడ్డులోని ఓ బ్యూటీపార్లర్‌ వద్ద బుధవారం సంభవించింది. అయితే వివాహేతర సంబంధమే కారణమా అన్న అనుమానాలు పలువురి నుంచి వ్యక్తమవుతున్నాయి. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. సంతబొమ్మాళి మండలం నర్సాపురం గ్రామానికి చెందిన నర్శిపురం తిరుపతిరావు, లక్ష్మి కోటబొమ్మాళి విద్యుత్‌ నగర్‌లో కొంతకాలంగా నివాస ఉంటున్నారు. లక్ష్మి కోటబొమ్మాళిలో హర్షిణి బ్యూటీ పార్లర్‌ అండ్‌ లేడీస్‌ కార్నర్‌ను నిర్వహిస్తోంది. ఆమె భర్త తిరుపతి రావు కేబుల్‌ ఆపరేటర్‌. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరగడంతో కోటబొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో భర్తపై లక్ష్మి ఫిర్యాదు చేసింది. అలాగే తన భార్య వివాహేతర సంబంధానికి కోటబొమ్మాళికి చెందిన ఓ కానిస్టేబులే కారణమని, దీనిపై దర్యాప్తు చేపట్టాలని నిందితుడు శ్రీనివాసరావు ఎస్పీకి సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ విష యంలో శాఖాపరంగా అంతర్గత విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యా హ్నం 3.30 గంటల సమయంలో భార్య లక్ష్మి బ్యూటీ పార్లర్‌ లో ఉండగా భర్త తిరుపతిరావు నేరుగా కత్తితో వెళ్లి ఆమె పీకను కోసి ముఖంపై దాడి చేసి అక్కడ నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న లక్ష్మిని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కోటబొమ్మాళి పోలీసులు అక్కడికి చేరు కున్నారు. నిందితుడైన శ్రీనివాసరావు కోసం పోలీసులు గాలించగా ఓ మద్యం దుకాణం వద్ద పట్టు బడినట్లు సమాచారం. క్లూస్‌టీం ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఇన్‌చార్జి సీఐ ఎ.విజయ్‌ కుమార్‌ నేతృత్వంలో ఎస్‌ఐ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోటబొమ్మాళి సీహెచ్‌సీకి తరలించారు. మృతురాలికి కుమార్తె, కుమారుడున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa