పాక్ ఆర్థిక వ్యవస్థపై మరోసారి భారీ దెబ్బ పడింది. భారత్ ఇటీవల చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’ ప్రభావంతో పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు భారీగా కుప్పకూలిపోయాయి. ఈ ఆపరేషన్ భయం పాక్ పెట్టుబడిదారులను గజగజలాడేలా చేసింది. ఈ నేపథ్యంలో, కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్ ఏకంగా 7,000 పాయింట్ల వరకు పడిపోయింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పాక్ ప్రభుత్వం తాత్కాలికంగా మార్కెట్లను మూసివేసే నిర్ణయం తీసుకుంది.
ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం, పాక్ స్టాక్ మార్కెట్లకు ఇటువంటి భారీ పతనం నుంచి త్వరలో కోలుకోవడం అసాధ్యమని చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతున్న దేశానికి ఇది మరో ఎదురుదెబ్బగా మారింది. విదేశీ పెట్టుబడులపై ఆధారపడి ఉన్న పాక్ మార్కెట్లకు నమ్మకద్రోహం రూపంలో ఇది తీవ్ర పరిణామాలను తీసుకురానుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
అదే సమయంలో భారత్ మాత్రం యుద్ధ వాతావరణం మధ్య కూడా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగిస్తోంది. భారతీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముందుకు సాగుతుండడం విశేషం. ఇది పెట్టుబడిదారులకు ధైర్యాన్ని కలిగిస్తోంది. అంతర్జాతీయంగా కూడా భారత మార్కెట్లపై నమ్మకం పెరుగుతోంది.
ఈ పరిణామాలు పాకిస్తాన్కు ఆర్థికపరంగా గట్టినే హెచ్చరికగా మారాయి. భారత్ చేపట్టిన వ్యూహాత్మక చర్యల వల్ల పాకిస్తాన్కి భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa