పరిగి మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా (ఎంపీడీఓ) పి. రెడ్డప్ప గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పరిగి ఎంపీడీఓ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అధికారుల సమక్షంలో బాధ్యతలను చేపట్టారు.
రెడ్డప్ప గతంలో తనకల్లులో పరిపాలన అధికారిగా విజయవంతంగా పనిచేశారు. పదోన్నతిపై ఇప్పుడు పరిగి మండలానికి ఎంపీడీఓగా నియమితులయ్యారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేశారు.
రెడ్డప్ప మాట్లాడుతూ, “మండల అభివృద్ధి కోసం పూర్తి నిబద్ధతతో పని చేస్తాను. అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తాను” అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa