ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమ్ము కశ్మీర్‌లో చిక్కుకున్న తమిళనాడు విద్యార్థులు

national |  Suryaa Desk  | Published : Fri, May 09, 2025, 08:04 PM

పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుంది. మంగళవారం రోజే పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. దీంతో దాయాది దేశం కూడా సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతూ, క్షిపణి దాడులకు పాల్పడుతోంది. దీంతో గజరాత్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సర్కారు హైఅలర్డ్ ప్రకటించి.. పాక్ చేసే దాడులను తిప్పికొడుతోంది. ఇలాంటి సమయంలో జమ్ము కశ్మీర్‌లో ఉండి చదువుకుంటున్న తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు, విజ్ఞాన యాత్ర కోసం అక్కడకు వెళ్లిన మరో నలుగులు విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ విషయం గుర్తించిన తమిళనాడు సర్కారు వారిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతుంది. ఇప్పటికే పెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.


తమిళనాడుకు చెందిన 52 మంది విద్యార్థులు జమ్ము కశ్మీర్‌లోని పలు విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తున్నారు. అలాగే ఇటీవలే ఆ రాష్ట్రానికి చెందిన మరో నలుగురు విద్యార్థులు విజ్ఞాన యాత్ర కోసం జమ్ము కశ్మీర్ వెళ్లారు. ఈ సమయంలోనే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. మొత్తంగా 26 మంది అమాయక పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు చెలరేగాయి. భారత్ సైతం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. ముఖ్యంగా దాయాది దేశంపై దౌత్య పరంగా చర్యలు తీసుకుంటూనే.. మంగళవారం రోజు అర్ధరాత్రి పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై క్షిపణి దాడులు చేసింది. దీంతో ఆ దేశం సైతం.. భారత్‌పై ప్రతిదాడులకు పాల్పడుతోంది.


ముఖ్యంగా ఎల్ఓసీ వెంట కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడింది. పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి నిత్యం కాల్పులు చేస్తూ వచ్చింది. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టగా.. ఆ మరుసటి రోజే పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఇలా 15 మంది అమాయక ప్రజలు సహా ఓ జవాన్‌ను కాల్చి చంపింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దీంతో భారత సర్కారు పంజాబ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇలాంటి సమయంలో బయటకురాలేక తమిళనాడుకు చెందిన 56 మంది విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు.


ఈ విషయం తెలుసుకున్న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వారిని సురిక్షతంగా స్వరాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. విమాన సర్వీసులు నిలిచిపోవగా.. రోడ్డు మార్గం అసురిక్షతం అని భావించి.. విమాన సర్వీసులు ప్రారంభమయ్యాకే వారిని తీసుకు రావాలని నిర్ణయించారు. అప్పటి వరకు వారి కోసం హెల్ప్ లైన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగానే సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. 52 మంది అక్కడే ఉండగా.. విజ్ఞాన యాత్ర కోసం వెళ్లిన విద్యార్థులు మాత్రం రోడ్డు గుండా తిరిగి వస్తున్నారని చెప్పారు.


ఇప్పటికే వారు ఢిల్లీ చేరుకున్నారని.. మే 10వ తేదీన స్వరాష్ట్రానికి చేరుకుంటారని వివరించారు. ఇక అక్కడే ఉన్న వారికోసం ఢిల్లీలోని తమిళనాడు భవన్‌లో 24 గంటలూ అందుబాటులో ఉండే హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే 011-24193300 (ల్యాండ్ లైన్), 9289516712 (వాట్సాప్ ఉన్న మొబైల్ నెంబర్) కు సమాచారం ఇవ్వాలని చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa