ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీర జవాన్ మురళి నాయక్‌కు ఎమ్మెల్సీ మంగమ్మ నివాళి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 02:13 PM

గోరంట్ల మండలం కల్లి తండా గ్రామానికి చెందిన వీర జవాన్ మురళి నాయక్‌కు శనివారం ఉదయం ఎమ్మెల్సీ మంగమ్మ, మాజీ మంత్రి శంకర్ నారాయణ ఘన నివాళులు అర్పించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాన్ని స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మురళి నాయక్ కుటుంబాన్ని ఎమ్మెల్సీ పరామర్శించారు. వారి ధైర్యానికి శ్లాఘన తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నర్సిరెడ్డి, గోరంట్ల, సోమందేపల్లి, పెనుకొండ మండలాలకు చెందిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు, అనేకమంది కార్యకర్తలు పాల్గొన్నారు. వీర జవాన్ చేసిన సేవను గుర్తు చేస్తూ, ఆయన త్యాగం తరతరాలకూ ఆదర్శంగా నిలవాలని హాజరైన నాయకులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa