ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ కాల్పుల్లో మరో జవాన్ వీరమరణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 02:39 PM

భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో పాక్ మరోసారి కాల్పులకు తెగబడింది. అయితే జమ్మూలో జరిపిన ఈ కాల్పుల్లో మరో భారత జవాన్ సచిన్ యాదవ్‌రావు వనాంజే (29) వీరమరణం పొందారు. సచిన్ యాదవ్‌రావు వనాంజే స్వస్థలం మహారాష్ట్ర – తెలంగాణ బార్డర్‌లోని నాందేడ్ జిల్లా తమ్లూర్. ఇవాళ సచిన్ యాదవ్‌రావు పార్థివదేహం స్వస్థలానికి రానుంది. ఈ కాల్పుల్లో ఆయనతో పాటు ఇద్దరు సాధారణ పౌరులు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు చెందిన మురళీనాయక్‌ కూడా జమ్మూ లోనే పాక్ చొరబాటుదారుల కాల్పుల్లో అమరుడయ్యాడు. ఆయన అంత్యక్రియలను ఏపీ ప్రభుత్వం అధికారిక, సైనిక లాంఛనాలతో ఘనంగా ఏర్పాట్లు చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa