ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైనిక చర్యను నిలిపివేయడంపై ఒప్పందం కుదిరింది: జైశంకర్

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 07:43 PM

భారత్‌- పాకిస్థాన్‌ మధ్య కాల్పులు, సైనిక చర్యలను నిలిపివేసే విషయంలో పరస్పర అవగాహనకు వచ్చాయని భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్‌, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పాక్‌ పలు భారత సైనిక స్థావరాలపై దాడికి యత్నించగా, భారత్‌ కూడా సమర్థంగా తిప్పికొట్టింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అంతమొందించి తీరుతుందని తెలిపారు. ఈనెల 12వ తేదీన భారత్ - పాక్ మధ్య ప్రత్యక్ష చర్యలు ఉంటాయని.. ప్రత్యక్ష చర్చల తర్వాతే కాల్పుల విరమణపై ఇరు దేశాలు నిర్ణయం తీసుకుంటాయని అన్నారు. ముందుగా కాల్పుల విరమణకు పాకిస్తాన్ డీజీఎంవో ప్రతిపాదించారని.. ఆ తర్వాత చర్చలకు తాము అంగీకరించామని తెలిపారు. మరో అంశంపై కానీ, మరో ప్రదేశంలో కానీ చర్చించాలన్న నిర్ణయాలేమీ లేవని అన్నారు. అంతకుముందు భారత్‌- పాకిస్తాన్‌లు కాల్పుల విరమణకు అంగీకరించాయని, ఇందుకు అమెరికా మధ్యవర్తిత్వం వహించిందని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో శనివారం సాయంత్రం ఓ పోస్ట్‌ పెట్టారు. ‘‘అమెరికా మధ్యవర్తిత్వంలో రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. తక్షణమే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్‌, పాక్‌ అంగీరించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa