ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాల్పుల విరమణకు భారత్‌-పాక్‌ అంగీకారం: పాక్ డిప్యూటీ పీఎం

international |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 07:41 PM

పాకిస్థాన్, భారత్ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ విషయాన్ని ఆ దేశ డిప్యూటీ పీఎం, విదేశాంగశాఖ మంత్రి ఇషాక్ దార్ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఇప్పటికే యూఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ విషయాన్ని Xలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరు దేశాలు విజ్ఞతతో, తెలివిగా వ్యవహరించాయని ధన్యవాదాలు తెలిపారు. తాజాగా భారత విదేశాంగ శాఖ సెక్రటరీ విక్రమ్ మిస్త్రీ సైతం కాల్పుల విరమణ ఒప్పందం జరిగినట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa