ట్రెండింగ్
Epaper    English    தமிழ்

69 ఎయిర్‌పోర్టుల్లో CISF తనిఖీలు

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 07:44 PM

పాక్-భారత్ మధ్య ఉద్రిక్తతలతో దేశ వ్యాప్తంగా 69 విమానాశ్రయాల్లో సీఐఎస్ఎఫ్ తనిఖీలు చేస్తోంది. ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరించడంతో అధికారులు క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తున్నారు. కార్గో, బ్యాగేజ్ స్క్రీనింగ్ వ్యవస్థల వద్ద పర్యవేక్షిస్తున్నారు. అయితే మరోవైపు కాల్పుల విరమణకు భారత్‌-పాక్‌ అంగీకరించాయి. దీంతో విమానాశ్రయాలు మళ్లీ తెరుచుకోనున్నాయి.బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు పారామిలిటరీ దళ ప్రతినిధి తెలిపారు. మే 18వ తేదీ వరకూ అన్ని ఎయిర్ పోర్టుల్లోని కార్గో, బ్యాగేజీ స్క్రీనింగ్ వ్యవస్థల వద్ద సీఐఎస్ఎఫ్ పర్యవేక్షణ ఉంటుందని స్పష్టం చేశారు. సాధారణంగా CISFకు ప్రయాణికులను, వారి క్యాబిన్ సామానును తనిఖీ చేసే బాధ్యత మాత్రమే ఉంటుంది. కార్గో, ఇన్ లైన్ హోల్డ్ బ్యాగేజీ స్క్రీనింగ్ సిస్టమ్ (ILHBSS) తనిఖీలను విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులు నియమించిన ప్రైవేట్ భద్రతా సిబ్బంది చేస్తారు. కానీ.. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అన్ని తనిఖీలు సీఐఎస్ఎఫ్ సిబ్బంది నిర్వహిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa