ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాకిస్థాన్‌ ఎన్నో అబద్ధాలు ప్రచారం చేసింది: సోఫియా ఖురేషి

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 07:46 PM

పాక్‌పై భారత సైనిక అధికారిణి సోఫియా ఖురేషి కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేక్ న్యూస్​తో పాక్ తప్పుడు కూతలు కూసిందని, ఎస్-400, బ్రహ్మోస్‌పై దాడి చేశామన్న పాకిస్థాన్‌ ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు. సిర్సా, జమ్ము, భటిండా, భుజ్, నలియా, పఠాన్‌కోట్‌ వాయుసేన స్థావరాలు, చండీగఢ్ ఆయుధాగారంపై దాడి చేశామన్న ప్రకటనల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అంతేకాక, ప్రార్థనా మందిరాలపై భారత్ దాడి చేసిందన్న ఆరోపణలను ఆమె ఖండించారు.పాక్ చెప్పినట్లు భారత ఆర్మీకి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు. కానీ నియంత్రణ రేఖ వెంబడి పాక్ తీవ్రం గా నష్టపోయిందని చెప్పారు. భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి యూఎస్ కృషి చేసిందని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు.  పాక్ రక్షణ మంత్రికి తెల్లవారు జామున 3.50 గంటలకు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్ చేశారని తెలిపారు. అదే విధంగా ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్ తో కూడా యూఎస్ విదేశాంగ మంత్రి మాట్లాడారని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa