ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ గెస్ట్ లెక్చరర్ల జీతాలు పెంపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 06:05 AM

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వారి పారితోషికాలను గణనీయంగా పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం నాడు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు  జారీ చేసింది. పెంచిన వేతనాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.తాజాగా విడుదల చేసిన జీఓ ప్రకారం, గెస్ట్ లెక్చరర్లకు ప్రస్తుతం గంటకు చెల్లిస్తున్న రూ.150 పారితోషికాన్ని రూ.375 కు పెంచారు. దీంతో పాటు, నెలకు గరిష్టంగా పొందగల వేతనాన్ని రూ.27,000గా ప్రభుత్వం నిర్ధారించింది. ఈ నిర్ణయం రాష్ట్రంలోని 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న 1,177 మంది గెస్ట్ లెక్చరర్ల కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనివ్వనుంది.రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేశ్ ఈ విషయంపై ప్రత్యేకంగా దృష్టి సారించి, గెస్ట్ లెక్చరర్ల వేతనాల పెంపునకు చొరవ చూపినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీర్ఘకాలంగా ఉన్న గెస్ట్ లెక్చరర్ల అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వేతనాల పెంపుదల వారిలో నూతనోత్సాహాన్ని నింపుతుందని, విద్యా బోధన మరింత మెరుగుపడటానికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa