ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణ అప్ డేట్స్

national |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 01:46 PM

నైరుతి రుతుపవనాలు  వేగంగా కదులుతున్నాయి. ఈ ఏడాది ముందుగానే కేరళను తాకనున్నాయి. మంగళవారం సాయంత్రానికి దక్షిణ అండమాన్ సముద్రం నికోబార్ దీవులు ఆగ్నేయ బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం, దక్షిణ మధ్య బంగాళాఖాతం, అండమాన్‌లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని తెలిపింది. ప్రస్తుతం అండమాన్‌–నికోబార్‌ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అండమాన్‌లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుందని పేర్కొంది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడురోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa