వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. బుగ్గమఠం భూముల ఆక్రమణ విషయంలో క్రిమినల్ కేసుల దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పెద్దిరెడ్డి 36 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించారని త్రిసభ్య కమిటీ తేల్చి చెప్పింది. ఆక్రమణ భూమిలో బుగ్గమఠం ల్యాండ్ 3.88 ఎకరాలు ఉన్నట్లు గుర్తించారు. కాగా, అటవీ చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన విషయం తెలిసిందే.1968 సెప్టెంబరు 16 నాటి మంగళంపేట అటవీ గెజిట్ ప్రకారం 2.413 కిలో మీటర్ల మేర 30 అడుగుల వెడల్పుతో 2.0574 హెక్టార్ల విస్తీర్ణంలో దారికి అనుమతించారు. పెద్దిరెడ్డి కుటుంబీకులు 2.50 కిలో మీటర్ల రహదారి నిర్మించారు. అనుమతించిన దాని కన్నా 87 మీటర్లు అధికంగా దారి వేసినట్లు కమిటీ గుర్తించింది.మంగళంపేటలోని 295, 299 సర్వే నంబర్లలో 75.75 ఎకరాలకు రైత్వారీ పట్టా ఉండగా, 2001, 2002 సంవత్సరాల్లో 295, 296 సర్వే నంబర్ల పేరుతో రిజిస్ట్రేషన్ లావాదేవీలు, 2017లో అడంగల్ సవరణలు ఎందుకు జరిగాయో అర్థం కావడం లేదని కమిటీ పేర్కొంది. పెద్దిరెడ్డి అటవీ ఆక్రమణపై జనవరి 29వ తేదీన ఈటీవీ భారత్-ఈటీవీ-ఈనాడు ప్రసారం చేసిన కథనాలు సంచలనం రేపగా, ఫిబ్రవరి 11వ తేదీన ప్రభుత్వానికి కమిటీ నివేదిక ఇచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa