నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వంశీ అనుచరుడు మోహన్ రంగారావుకు కూడా నూజివీడు కోర్టు ఇదే విధమైన ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు జిల్లా పరిధిలోని బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్న ఆరోపణలపై వల్లభనేని వంశీ, మోహన్ రంగారావులపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన నూజివీడు న్యాయస్థానం, ఇరువురికీ మే 29వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది.అంతేకాకుండా, ఈ కేసులో నిందితులుగా ఉన్న వీరిద్దరిపై ప్రొడక్షన్ ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు కూడా కోర్టు అనుమతి మంజూరు చేసినట్లు సమాచారం. తదుపరి దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.పలు కేసుల్లో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చినప్పటికీ, మరికొన్ని కేసుల్లో రిమాండ్ ఎదుర్కొంటున్నారు
![]() |
![]() |