ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రానైట్ క్వారీలో ప్రమాదం, ముగ్గురు కార్మికులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 17, 2025, 12:55 PM

 శ్రీకాకుళం జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురం వీఆర్టీ గ్రానైట్ క్వారీలో ఇవాళ (శనివారం) విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. వీఆర్టీ గ్రానైట్ క్వారీలో పేలుడు సంభవించడంతో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ప్రమాదంలో చనిపోయిన కార్మికులు తెర్లంగి రామారావు, బడబంద అప్పన్న, తమిళనాడుకు చెందిన వంగ వేణు ఆర్ముగంగా గుర్తించారు. క్వారీలో భారీ పేలుడు సంభవించిందని, ఆపై పిడుగుపడినట్లు వీఆర్టీ గ్రానైట్ క్వారీ యాజమాన్యం తెలిపింది. అయితే ఈ ప్రమాదంపై కార్మికుల కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కార్మికుల మృతదేహాలు ఛిద్రమయ్యాయి. ఇది సాధారణ ప్రమాదం కాదని పేలుడు కారణంగానే కార్మికులు మృతిచెందారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఘటన జరిగిన స్థలానికి పోలీసులు వెళ్లి విచారణ ప్రారంభించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa