ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాన్డ్, ట్రెయిన్డ్, ఎగ్జిక్యూటెడ్, జస్టిస్ సర్వ్‌డ్.. ఆర్మీ సరికొత్త వీడియో

national |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 07:47 PM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని మొత్తం 9 ఉగ్రస్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసింది. ఇందుకు ప్రతీకారంగా పాక్ సైతం డ్రోన్ దాడులకు పాల్పడింది. కానీ ఇండియా వాటిని చాకచక్యంగా ఎదురుకుని దాయాది దేశానికి చుక్కలు చూపించింది. ఇక భారత్‌తో గెలవలేమని గుర్తించిన పాక్ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో భారత్ కూడా వెనక్కి తగ్గి కాల్పుల విరమణ ఒప్పందానికి ఓకే చెప్పింది. ఇక అప్పటి నుంచి మన సైన్యం పాక్‌పై చేసిన దాడుల వీడియోలను ఎప్పటికప్పుడు విడుదల చేస్తూనే వస్తోంది. ముఖ్యంగా భారత్ చేసిన దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి సాక్ష్యాలుగా ఆర్మీ వీటిని విడుదల చేస్తుండగా తాజాగా మరో వీడియో విడుదల చేసింది. ప్లాన్డ్, ట్రెయిన్డ్, ఎగ్జిక్యూటెడ్.. జస్టిస్ సర్వ్‌డ్ అంటా రాసుకొచ్చి మరీ ఎక్స్ వేదికగా ఓ వీడియోను షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్ క్షిపణి దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేయగా.. ఇండియన్ ఆర్మీ ఇప్పటికే ఇందుకు సంబంధించిన వీడియోలను విడుదల చేసింది. ముఖ్యంగా దాయాది దేశంలోని ఉగ్రస్థావరాలపై కచ్చితత్వంతో దాడులు చేయడానికి భారత సైన్యం ఎలా ప్రణాళికలు రచించింది, సైనికులకు ఏ విధంగా శిక్షణ ఇచ్చింది, దాడులను ఎలా అమలు చేసిందనే విషయాన్ని ఈ వీడియోలో వివరించింది.


 వీడియో ప్రారంభం కాగానే.. ఆపరేషన్ సిందూర్ టైటిల్ కార్డును చూపించారు. ఆపై ఆర్మీ వెస్ట్రన్ కమాండర్ మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడితో దేశ ప్రజల్లో ఆక్రోశం లావాలా పొంగిందని చెప్పుకొచ్చారు. అలాగే ఈసారి పాక్‌కు తరతరాలు గుర్తించుకునేలా గుణపాఠం నేర్పాలనే ఒకే ఒక్క ఆలోచన ప్రతీ జవాన్ మనసులో ఉందన్నారు. ఇది ప్రతీకార చర్య కాదని బాధిత కుటుంబాలకు సైన్యం చేసిన న్యాయం అని చెప్పారు. ఉగ్రవాదులను పోషిస్తున్న పాక్‌కు తగిన గుణపాఠం అని వీడియోలో కనిపిస్తున్న సైనికులు అంతా పేర్కొన్నారు. ఇక్కడితో వీడియో అయిపోగా.. చివర్లో జైహింద్ అని వచ్చింది.


భారత్ ఏమేం నాశనం చేసిందంటే..?


పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. మే 7వ తేదీన పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది. ఆపై పాక్ కూడా ప్రతిదాడులకు పాల్పడుతూ.. డ్రోన్లతో భారత పౌరులు, సైనికుల ప్రాణాలను తీసింది. దీంతో భారత్ వాటిని ఎదుర్కుంటూనే మే 9, 10వ తేదీన పాకిస్థాన్‌లోని కీలక వాయుసేన స్థావరాలపై అత్యంత కచ్చితత్వంతో దాడులు చేసింది. పూర్తి స్వదేశీ ఆయుధాలతోనే దాడి చేసి మొత్తంగా 11 వాయుసేన స్థావరారలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు నేరుగా ఇండియానే ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa