పాకిస్థాన్తో కాల్పలు విరమణ ఒప్పందంపై భారత సైన్యం కీలక ప్రకటన చేసింది. మే 10న ఇరు దేశాల మధ్య జరిగిన ఒప్పందానికి ఎలాంటి గడువు లేదని, కాల్పుల విరమణ కొనసాగుతుందని పేర్కొంది. పాక్తో కాల్పుల విరమణ ఒప్పందం మే 18 సాయంత్రం 5 గంటలతో ముగియనుందని జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో ఇరు దేశాల మధ్య నాలుగు రోజుల పాటు కొనసాగిన సైనిక ఘర్షణ కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసిన విషయం తెలిసిందే. భారత్, పాకిస్థాన్ సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ మధ్య మే 12న జరిగిన హాట్లైన్ చర్చల ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని భారత సైన్యాధికారి ఆదివారం వెల్లడించారు. ఈ విరామం తాత్కాలికమన్న అపోహలను ఆయన ఖండించారు.
‘‘భారత-పాకిస్థాన్ సైనికాధికారులు డీజీఎంఓల (Director General of Military Operations) మధ్య జరిగిన చర్చలో నిర్ణయించిన విధంగా కాల్పుల విరమణ కొనసాగుతుందనే దానిపై ఎలాంటి గడువు లేదు’ అని స్పష్టం చేశారు. అంతేకాదు, ఆదివారం డీజీఎంఓల మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని ఆయన తెలిపారు. మరోవైపు, భారత్తో కాల్పుల విరమణ ఒప్పందానికి (Ceasefire Agreement) తాము కట్టుబడి ఉన్నామని పాకిస్థాన్ తెలిపింది. ఉద్రిక్తతల తగ్గింపు, ప్రాంతీయ స్థిరత్వం కోసం తగిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్ పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ అనంతరం ప్రధాని మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం అనంతరం పాక్ ఇలా స్పందించింది.
India Pakistan Ceasefire: భారత్-పాక్ కాల్పుల విరమణ.. తక్షణమే అమల్లోకి వచ్చిన సీజ్ఫైర్..
మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద సంస్థలకు చెందిన 9 శిబిరాలను ధ్వంసం చేసి.. 100 మంది ఉగ్రవాదులను హతమార్చింది.
ఈ దాడిని జీర్ణించుకోలేని పాకిస్థాన్.. భారత్పై డ్రోన్లు, క్షిపణులు, యుద్ధ విమానాలతో దాడికి యత్నించింది. ఈ దాడులను భారత సైన్యం సమర్ధవంతంగా అడ్డుకుని.. పాక్ క్షిపణులు, డ్రోన్లను తుక్కుతుక్కు చేసింది. నాలుగు రోజుల పాటు ఇరు దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణ పూర్తిస్థాయి యుద్ధానికి దారితీస్తుందనే భయాందోళనలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇరుదేశాలూ చర్చలు జరిపి.. కాల్పుల విరమణకు అంగీకరించాయి. దీంతో సరిహద్దుల్లో క్రమంగా ఉద్రిక్తతలు తగ్గి పరిస్థితి సాధారణంగా మారుతోంది. ఈ క్రమంలో కాల్పుల విరమణ గడువు ముగిసిపోతుందనే ప్రచారం జరుగుతోంది. ఇరు దేశాలూ కాల్పుల విరమణ కొనసాగించాలని ఇప్పటికే నిర్ణయించాయి. అయితే, చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం, జమ్మూ కశ్మీర్లోని పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలపైనే ఉంటుందని భారత్ తేల్చిచెప్పింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa