ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓట్స్ కు ఎవరు దూరంగా ఉండాలో తెలుసా?

Health beauty |  Suryaa Desk  | Published : Sun, May 18, 2025, 11:47 PM

ఓట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓట్స్‌లో ఫైబర్‌తో పాటు ప్రోటీన్, విటమిన్లు, మెగ్నిషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలతో పాటు ఎన్నో పోషకాలు ఉంటాయి. ఓట్స్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో, ఇది బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ ఆప్షన్. ఓట్స్‌లో కరిగే ఫైబర్ బీటా - గ్లూకాన్ ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించడంలో సాయపడుతుంది. ఓట్స్ జీర్ణక్రియకు సాయపడతాయి. మలబద్దకాన్ని నివారిస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది ఓట్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం ఓట్స్ తినకూడదు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.


డయాబెటిస్


ఈ రోజుల్లో చాలా మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. ఇలాంటి వారు ఓట్స్ తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజానికి, ఓట్స్‌లో కార్బోహైడ్రేట్లు ఉంటాయి, వీటిని తినడం వల్ల కొన్నిసార్లు శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఇప్పటికే మధుమేహం ఉన్నవారికి దీన్ని తినడం ఆందోళన కలిగించే విషయంగా మారుతుంది. డయాబెటిస్‌తో బాధపడేవారు ఓట్స్‌ని తినకపోవడమే మేలు. ఒకవేళ తినాలనుకుంటే డాక్టర్‌ని సంప్రదించి సలహా తీసుకోవడం ముఖ్యమని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


ఐబీఎస్ ఉన్న వ్యక్తులు


ఓట్స్‌లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సాయపడుతుంది. కానీ, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) ఉన్నవారు ఓట్స్‌లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ ద్వారా ప్రేరేపించబడవచ్చు. కొంతమందిలో, ఓట్స్ పేగులో కిణ్వ ప్రక్రియకు దారితీసి ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. IBS ఉన్నవారు లేదా సున్నితమైన జీర్ణక్రియ ఉన్నవారు ఓట్స్ తినకపోవడమే మేలు. ఒకవేళ తినాలనిపిస్తే మితంగా తినాలి.


మినరల్స్ లోపం


ఓట్స్‌లో ఫైటిక్ యాసిడ్ ఉంటుంది. ఇది యాంటీన్యూట్రియంట్. ఇది కాల్షియం, ఐరన్, జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలతో బంధించి, శరీరంలో వాటి శోషణను తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఇది హానికరం కానప్పటికీ, మినరల్స్ లోపం అంటే ఐరన్, జింక్, కాల్షియం లోపాలంతో బాధపడేవారు ఓట్స్ తినకూడదు. ఒకవేళ తినాలనిపిస్తే ఓట్స్‌ను తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.


మూత్రపిండ వ్యాధులు, చర్మ అలెర్జీ


చర్మ అలెర్జీలతో పాటు మూత్రపిండ వ్యాధులతో బాధపడేవారు ఓట్స్‌కి దూరంగా ఉండాలి. ఓట్స్‌లో ఫాస్పరస్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలకు అంత మంచిది కాదు. ఓట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫాస్పరస్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో, కిడ్నీలపై ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఇప్పటికే కిడ్నీ వ్యాధులతో బాధపడేవారు ఓట్స్‌కి దూరంగా ఉండాలి. చర్మ అలెర్జీలతో బాధపడేవారు ఎక్కువగా తింటే దురద, మంట వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.


ఓట్స్ ఎక్కువగా తింటే ఏమవుతుంది?


సెలియాక్ వ్యాధి


ఓట్స్‌లో గ్లూటెన్ ఉండదు. అయితే, వాటిని తయారు చేయడానికి ఒక ప్రక్రియ జరుగుతుంది. అనేక ఇతర ధాన్యాలతో పాటు ఓట్స్‌ని కూడా ప్రాసెస్ చేస్తారు. ఇది క్రాస్-పొల్యూషన్ ప్రమాదాన్ని కలిగిస్తుంది. అందుకే సెలియాక్ వ్యాధి ఉన్నవారికి ఈ ఓట్స్ ప్రమాదాన్ని కలిగించవచ్చు. వీరు ఓట్స్ తింటే కడుపు నొప్పితో పాటు, అనేక ఇతర ఆరోగ్య సమస్యలు సంభవించవచ్చు. అందుకే సెలియాక్ వ్యాధితో బాధపడేవారు ఓట్స్‌కి దూరంగా ఉండటమే మేలు అంటున్నారు ఎక్స్‌పర్ట్స్.


ఈ విషయాలు కూడా ముఖ్యం


* చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో కేవలం ఓట్స్‌ని మాత్రమే తింటున్నారు. అయితే ఇది పెద్ద తప్పు. కేవలం ఓట్స్ తింటే పోషకాలు సరిగ్గా అందవు. అందుకే ఓట్స్‌తో పాటు మిగతా పోషకాలు ఉండేలా చూసుకోవాలి.


* ఏ ఆహారం అయినా సరే మితంగా తింటేనే ఆరోగ్యం. అందుకే ఓట్స్ పరిమిత పరిమాణంలో తినాలి. ఎక్కువగా తింటే చాలా ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


* ఓట్స్ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడం, చర్మంపై అలెర్జీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.


* ఓట్స్ సరిగ్గా ఉడికించి తినకపోతే కడుపులో ఇబ్బందులు తలెత్తవచ్చు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com