తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకటించిన క్రమంలో, ఆ పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు మంగళవారం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ధైర్యం, తెగువ అవసరమని, భయపడే వారికి రాజకీయాలు సాధ్యపడవని ఆయన స్పష్టం చేశారు.
"కలియుగంలో రాజకీయాలు చేయాలంటే కేసులకు, జైళ్లకు భయపడకూడదు. ప్రజాస్వామ్యాన్ని హీనంగా ఉపయోగించుకుంటూ, ఉప ఎన్నికల్లో జరుగుతున్న ఘర్షణలు, అవినీతి చర్యలు దురదృష్టకరం. మన ప్రభుత్వ హయాంలో ఇలాంటి రాజకీయాలు జరగలేదు. ప్రజలే సాక్షులు," అని జగన్ తెలిపారు.
అలాగే, "ప్రజలు చూస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారో స్పష్టంగా గ్రహిస్తున్నారు. మనకూ టైం వస్తుంది. వాళ్లకు సినిమా చూపిస్తాం," అంటూ రాజకీయ ప్రత్యర్థులకు తీవ్ర హెచ్చరిక చేశారు.
ఈ వ్యాఖ్యల ద్వారా జగన్ గారు తన పార్టీ కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశారు. పంచాయతీ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయివరకు ప్రజల మద్దతు తమ పార్టీకే ఉంటుందని, చివరికి న్యాయం జరిగి తమ విజయమే ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa