ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైలాస్-మానస సరోవర్ యాత్ర మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు

national |  Suryaa Desk  | Published : Tue, May 20, 2025, 07:34 PM

ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ జిల్లాలో నేడు కొండ చరియలు విరిగి పడ్డాయి. ముఖ్యంగా కైలాస్-మానస్ సరోవర్ యాత్ర మార్గంలో ఒక్కసారిగా కొండ చరియలు విరిగి పడగా.. వందలాది మంది యాత్రికులు అక్కడే చిక్కుకుపోయారు. వీరితో పాటే స్థానికులు కూడా అక్కడే ఉండిపోగా.. అధికారులు అప్రమత్తం అయ్యారు. రోడ్లపై పడిపోయిన శిథిలాలను తొలగించేందుకు పెద్ద ఎత్తన ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందాన్ని రంగంలోకి దింపగా.. సహాయక చర్యలను కొనసాగిస్తోంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానిక అధికారులు వివరించారు.


ఉత్తరాఖండ్‌లోని కైలాస్-మానస సరోవర్ యాత్ర గత ఐదు సంవత్సరాలు నిలిచిపోయింది. ముఖ్యంగా 2020లో కరోనా కారణంగా కైలాస పర్వతం, మానస సరోవర్ సరస్సు యాత్రను అప్పట్లో నిలిపివేశారు. ఆ తర్వాత రెండేళ్లకు కరోనా తగ్గిపోయినప్పటికీ.. గల్వాన్ ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా భారత్, చైనా దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినగా.. ఈ యాత్ర నిలిపివేతను అలాగే కొనసాగించారు. అయితే 2024లో రష్యా అధ్యక్షుడు చొరవ తీసుకుని.. చైనా, భారత్ దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పాలని చూశారు. అందుకే ఇటు ప్రధాని మోదీని, అటు చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌లను తమ దేశానికి పిలిపించి సమావేశం ఏర్పాటు చేశారు. ఇలా రెండు దేశాల మధ్య పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి.


దీంతో ఈ ఏడాది జూన్ నుంచి కైలాస్-మానస సరోవర్ యాత్రను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గత నెలలోనే అధికారికంగా ప్రకటించింది. జూన్ నుంచి ఆగస్టు వరకు ఇది కొనసాగుతుందని.. ఈ యాత్ర ఉత్తరాఖండ్, సిక్కింలలో ప్రారంభం కాబోతుందని కూడా స్పష్టం చేసింది. అయితే 50 మంది యాత్రికుల చొప్పున 5 బృందాలు ఉత్తరాండ్‌లోని లిపులేఖ్ పాస్ నుంచి.. మరో 10 బృందాలు సిక్కిం నాథులా పాస్ నుంచి ఈ యాత్రకు తరలి వెళ్తాయని వివరించింది. దీంతో అనేక మంది యాత్ర కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆన్‌లైన్ ద్వారానే ఎంపికలు కూడా చేసింది. ఈక్రమంలోనే యాత్రికులు ఉత్తరాఖండ్‌లోని పితోరాగఢ్ చేసుకున్నారు.


అయితే అనుకోకుండా మంగళవారం రోజు కొండ చరియలు విరిగి పడడంతో వందలాది మంది యాత్రికులు సహా స్థానికులు అక్కడే చిక్కుకుపోయారు. అయితే విషయం గుర్తించిన స్థానిక అధికారులు వారిని కాపాడేందుకు, రోడ్లపై పడిపోయిన శిథిలాలను తొలగించేందుకు సహాయక చర్యలను ప్రారంభించారు. ముఖ్యంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బృందాన్ని రంగంలోకి దింపారు. అయితే అదృష్టవశాత్తు తాజా ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. పరిస్థితులు పూర్తిగా మెరుగుపడే వరకు యాత్రికులు అక్కడే ఉండాలని కూడా సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa