"అమ్మా, నేను దొంగతనం చేయలేదు" అంటూ 13ఏళ్ల బాలుడు రాసిన సూసైడ్ నోట్ అందరి మనసులను కలచివేసింది. చేయని దొంగతనం తనపై మోపారనే అవమానంతో బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన పశ్చిమ బెంగాల్లోని తూర్పు మిడ్నాపూర్లో జరిగింది. చిప్స్ దొంగిలించాడనే నింద స్థానికుల ప్రకారం,.. కృష్ణేందు అనే 13 ఏళ్ల బాలుడు బకుల్డా హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం గోసైన్బర్ మార్కెట్లోని ఓ షాప్ యజమాని శుభాంకర్ దీక్షిత్.. కృష్ణేందు తన షాపు నుంచి మూడు చిప్స్ ప్యాకెట్లను దొంగిలించాడని ఆరోపణలు చేశాడు. స్థానికులు కూడా కృష్ణేందు చిప్స్ ప్యాకెట్లు తీసుకున్నాడని ఆరోపించారు. దీంతో షాప్ యజమాని శంభాకర్ కృష్ణేందును కొట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పమని బలవంతం చేశాడు. తాను దొంగతనం చేయలేదని చెప్పినా యజమాని వినలేదు. ఆ తర్వాత అతడి తల్లి కూడా దుకాణానికి తీసుకెళ్లి యజమాని ముందు మందలించింది. తాను దొంగతనం చేయకపోయినా తనపై నిందమోపడంతో కృష్ణేందు తట్టుకోలేకపోయాడు. ఇంటికి వచ్చాక ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు ప్రయతించాడు. విషయం తెలుసుకున్న తల్లి దండ్రులు వెంటనే తమ్లుక్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడు. ఆత్మహత్యకు ముందు కృష్ణేందు "అమ్మా, నేను దొంగతనం చేయలేదు" అంటూ లేఖను రాశాడు. దీంతో దుకాణదారుడి అవమానం వల్లే తన ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa