ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సౌండ్ తగ్గించమన్నందకు భార్యపై యాసిడ్ పోసిన వ్యక్తి

national |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 02:15 PM

బెంగళూరులోని సిద్దేదహల్లిలో షాకింగ్ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆ మహిళ ఓ బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. అయితే మద్యంకు డబ్బు కావాలని భర్త కోరగా.. మొదట నిరాకరించినా తర్వాత ఇచ్చింది. అతడు ఫుల్‌గా తాగి ఫోన్‌లో పాటలు వింటుండగా.. సౌండ్ తగ్గించమని భార్య కోరింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అతడు బాత్రూంలో ఉన్న యాసిడ్ తెచ్చి ఆమెపై పోశాడు. మహిళకు తీవ్ర గాయాలయైగాయాలయ్యాయి. ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa