ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గువ్వలచెరువు ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం..

Crime |  Suryaa Desk  | Published : Sat, May 24, 2025, 09:12 PM

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చింతకొమ్మదిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ రోడ్‌లో లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితులు రాయచోటి నుంచి కడపకు కారులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గువ్వలచెరువు ఘాట్ రోడ్డు వద్దకు రాగానే వెనుకవైపు నుంచి లారీ కారును వేగంగా వచ్చి ఢీకొట్టింది. అతివేగంతో నియంత్రించుకోలేకపోవటంతో లారీ ఏకంగా కారుపైకి ఎక్కేసింది. దీంతో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa