హిందూపురం, త్యాగరాజనగర్, ఆర్.టీ.సి. కాలనీలలో సోమవారం నిర్వహించిన వార్డు పర్యటనలో భాగంగా మున్సిపల్ చైర్మన్ రమేష్ కుమార్ ప్రజల సమస్యలను స్వయంగా పరిశీలించారు. రోడ్లు, కాలువలు, శానిటేషన్, స్ట్రీట్ లైటింగ్, నీటి సరఫరా వంటి అంశాలలో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ప్రత్యేకించి, కాలనీలలో నీటి పైప్లైన్ లీకేజీల వల్ల నీరు వృథా అవుతున్న విషయం గమనించిన చైర్మన్, వెంటనే రిపేరు చేసి లీకేజీలను అరికట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సౌకర్యం కోసం అన్ని చర్యలూ తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa