రాష్ట్రంలో కొనుగోలు చేసేవారు లేక పొగాకు రైతులు అల్లాడుతుంటే కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెల్ల, నల్లబర్లీ పొగాకు సాగు చేసిన రైతులు కొనేవారు లేక, పంటలను ఏం చేసుకోవాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వంలో కొద్దిపాటి చలనం కూడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు రైతులకు అండగా ఈ నెల 28వ తేదీన మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటిస్తున్నారని వెల్లడించారు. ఈ ప్రభుత్వం మెడలు వంచి, పొగాకు కొనుగోళ్ళు జరిపించే వరకు రైతులతో కలిసి వైయస్ఆర్సీపీ ఉద్యమిస్తుందని వెల్లడించారు. అయన మాట్లాడుతూ..... మెట్టప్రాంతంలో పొగాకు కొనుగోళ్ళు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. నేరుగా రోడ్లమీదికి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా చోద్యం చూస్తోంది. ఆనాడు పొగాకు కొనుగోళ్లలో ఇలాంటి ప్రతిష్టంభన ఏర్పడితే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ముందుకు వచ్చి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్ళు చేయించింది. వ్యాపారులు ముందుకు వచ్చి కొనుగోళ్ళు చేయకపోతే మార్కెఫెడ్ ద్వారా రూ.118 కోట్లతో పొగాకు కొనుగోళ్ళు చేసి వైయస్ జగన్ రైతులను ఆదుకున్నారు అని వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa