ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ పీజీసెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమై మే 5వ తేదీతో ముగిసింది. అయితే నోటిఫికేషన్లో ప్రవేశ పరీక్షల తేదీలను మాత్రం పేర్కొనలేదు. దీంతో తాజా ఈ పరీక్షల షెడ్యూల్ను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. తాజా షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్యాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2025 పరీక్షలు జూన్ 9 నుంచి 12వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో రోజుకు రెండు విడతల్లో ఉదయం, సాయంత్రం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రవేశాలు కల్పించే యూనివర్సిటీలు ఇవే.. ఆంధ్ర యూనివర్సిటీ (విశాఖపట్నం) డా.బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ (శ్రీకాకుళం) శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) డా.అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ (కర్నూలు) శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ(అనంతపురం) ద్రవిడియన్ యూనివర్సిటీ (కుప్పం) ఆచార్య నాగార్జన యూనివర్సిటీ (గుంటూరు) కృష్ణా యూనివర్సిటీ (మచిలీపట్నం) శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (తిరుపతి) ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (రాజమహేంద్రవరం) యోగి వేమన యూనివర్సిటీ (కడప) క్లస్టర్ యూనివర్సిటీ (కర్నూలు) రాయలసీమ యూనివర్సిటీ (కర్నూలు) ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ (ఒంగోలు) విక్రమ సింహపురి యూనివర్సిటీ (నెల్లూరు) జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ అనంతపూర్- ఆయిల్ టెక్నలాజికల్ అండ్ ఫార్మాస్యూటికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి) ఏపీ పీజీసెట్-2025 ఎగ్జామినేషన్ షెడ్యూల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. కాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 17 యూనివర్సిటీలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 150కి పైగా పీజీ కోర్సుల్లో ఈ ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. యూనివర్సిటీ వారీగా అందుబాటులో ఉన్న సీట్లలో 85 శాతం సీట్లు స్థానిక విద్యార్థులకే కేటాయిస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa